ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా జగన్ గారూ : నారా లోకేశ్

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (16:00 IST)
నవ్యాంధ్రలో సాగుతున్న మద్యం విక్రయాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శలు సంధించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్వార్టర్ బాటిల్ మద్యం అమ్మకం తగ్గిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. "మద్యపాన నిషేధం కోసం జగన్ 'మంద'డుగు వేస్తూనే ఉన్నారు. దాని ఫలితమే కాబోలు.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. 
 
జగనన్న మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైకాపా మార్క్ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా షాపులు తగ్గించాం, బార్లు తగ్గించడానికి శ్రమిస్తున్నాం అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా.. గతంలో కంటే ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా చెప్పండి జగన్ గారు" అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments