Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ ఆతిథ్యం అమితానందానికి గురిచేసింది : జీ జిన్‌పింగ్

మీ ఆతిథ్యం అమితానందానికి గురిచేసింది : జీ జిన్‌పింగ్
, శనివారం, 12 అక్టోబరు 2019 (12:55 IST)
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆతిథ్యానికి మంత్రమగ్ధులయ్యారు. ఈ పర్యటనలో భాగంగా, ప్రధాని మోడీ - జిన్‌పింగ్‌లు శనివారం మహాబలిపురం సముద్రతీరంలో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. 
 
ఈ భేటీలో చైనా అధినేత మాట్లాడుతూ, 'మీరు ఇచ్చిన ఆతిథ్యం మ‌మ్మ‌ల్ని అమితానందానికి గురి చేసింది. నేను, మా అధికారులంతా ఇదే ఫీలింగ్‌తో ఉన్నాం. ఈ అనుభ‌వాలు.. త‌న‌కు, త‌న బృందానికి చిర‌కాల స్మృతుల‌గా మిగిలిపోతాయి అని జిన్‌పింగ్ అన్నారు. 
 
అలాగే, శుక్ర‌వారం మ‌హాబ‌లిపుంలో జ‌రిగిన స‌మావేశం గురించి కూడా జిన్‌పింగ్ గుర్తు చేశారు. మామ‌ల్ల‌పురంలో మ‌నం ఇద్ద‌రు స్నేహితుల్లా మాట్లాడుకున్నట్టు వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాల‌పై మ‌న‌స్ఫూర్తిగా చ‌ర్చించుకున్నామ‌ని జిన్‌పింగ్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Mahabalipuram సాక్షిగా కొత్త శకం ఆరంభం : మోడీ పిలుపు