Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో అదుర్స్.. ఐదువేల పరుగుల మైలురాయి.. ధోనీకొక్కడికే సాధ్యం..!

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (10:00 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. లోయర్ ఆర్డర్‌లో దిగి అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకోవడం మహీకి మాత్రమే సాధ్యమన్నాడు. 
 
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టిన ధోనీ.. ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ధోనీ పెర్ఫామెన్స్‌పై అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సెహ్వాగ్.. ఈ ఫీట్ ధోని ఒక్కడికే సాధ్యమన్నాడు. 
 
ధోనీ గొప్ప ఆటగాడని సెహ్వాగ్ కొనియాడాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇక ధోనీ ఆడింది మూడు బంతులే అయినా.. తనదైన మార్క్ చూపించాడు. 
 
ధోనీ బ్యాటింగ్ చేసే సమయంలో జియో సినిమా వ్యూస్ సంఖ్య కోటీ 80 లక్షలకు చేరింది. ఇంకా  ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా ధోనీ తన రికార్డును పదిలం చేసుకున్నాడు. ఇలాంటి ఫీట్స్‌ ధోనీ వల్లే సాధ్యమన్నాడు సెహ్వాగ్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments