Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అహ్మదాబాద్ టెస్ట్ : భారత్ 571 ఆలౌట్ - కోహ్లీ డబుల్ సెంచరీ మిస్

kohli
, ఆదివారం, 12 మార్చి 2023 (17:45 IST)
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాపై 91 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. ఇందులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీనే హైలెట్‌గా నిలిచింది. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు చాలా ఓపిగ్గా ఆడారు. ఫలితంగా భారత్ భారీ స్కోరు చేసింది. అయితే, కోహ్లీ మొత్తం 186 పరుగులు చేసి డబుల్ సెంచరీని చేజార్చుకుని 9వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 
 
అలాగే, సుధీర్ఘ కాలం తర్వాత కోహ్లీ చేసిన 28వ వ్యక్తిగత సెంచరీ. ఈయన 2019లో చివరిసారి సెంచరీ చేశాడు. 2019 నవంబరులో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ చివరిసారిగా సెంచరీ చేశాడు. కాగా, కోహ్లీ ఇప్పటివరకు చేసిన 27 సెంచరీల్లో ఎక్కువ బంతులు ఎదుర్కొని చేసిన రెండో సెంచరీ ఇదే. మొత్తం 241 పరుగులు ఫేస్‌ చేసి సెంచరీ చేశాడు. గత 2012-13లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 289 బంతులు ఎదుర్కొని కోహ్లీ సెంచరీ చేశాడు. ఇది 28వ టెస్ట్ సెంచరీ కాగా, మొత్తంగా 75వ ఇంటర్నేషనల్ సెంచరీ కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అహ్మదాబాద్ టెస్ట్ : సెంచరీ కొట్టిన కోహ్లీ... ఆసీస్ స్కోరును దాటేసిన భారత్