Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో సందడి చేసిన రిషబ్ పంత్

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (09:58 IST)
ఐపీఎల్ 2023 సీజన్‌లో భారత క్రికెటర్ రిషబ్ పంత్ సందడి చేశాడు. గత యేడాది ఆఖరులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్.. ప్రస్తుతం కొంతమేరకు కోలుకున్నారు. ముఖ్యంగా ఆయన మోకాలికి ఆపరేషన్ చేయడంతో నిరవధికంగా ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో సందడి చేశారు. 
 
మంగళవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ - గుజరాత్ జట్ల మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన ఊతకర్ర సాయంతో ఆడియన్స్ గ్యాలెరీలో కనిపించారు. బీసీసీఐ ఉన్నతాధికారులు కూర్చునే గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ ఢిల్లీ కెప్టెన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కావడంతో లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో డీసీ జట్టు డగౌట్లో అతడి జెర్సీని ప్రదర్శించడం తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. 
 
రిషబ్‌ జెర్సీని ఇలా డగౌట్లో ఉంచొద్దని ఢిల్లీ ఫ్రాంఛైజీకి బీసీసీఐ సూచించినట్లు తెలిసింది. 'డగౌట్‌పై పంత్‌ జెర్సీని వేలాడదీయడం బాగోలేదు. ఏదైనా విషాదం లేదా రిటైర్‌మెంట్‌ సమయంలోనే ఇలాంటివి చూస్తాం. పంత్‌ క్షేమంగా ఉన్నాడు. ఊహించి దానికంటే వేగంగా కోలుకుంటున్నాడు. ఒక మంచి ఆలోచనతోనే ఢిల్లీ ఈ పని చేసినా.. ఇలాంటి చర్యలు మానుకోవాలని' బీసీసీఐ సూచించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

తర్వాతి కథనం
Show comments