Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో సందడి చేసిన రిషబ్ పంత్

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (09:58 IST)
ఐపీఎల్ 2023 సీజన్‌లో భారత క్రికెటర్ రిషబ్ పంత్ సందడి చేశాడు. గత యేడాది ఆఖరులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్.. ప్రస్తుతం కొంతమేరకు కోలుకున్నారు. ముఖ్యంగా ఆయన మోకాలికి ఆపరేషన్ చేయడంతో నిరవధికంగా ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో సందడి చేశారు. 
 
మంగళవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ - గుజరాత్ జట్ల మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన ఊతకర్ర సాయంతో ఆడియన్స్ గ్యాలెరీలో కనిపించారు. బీసీసీఐ ఉన్నతాధికారులు కూర్చునే గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ ఢిల్లీ కెప్టెన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కావడంతో లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో డీసీ జట్టు డగౌట్లో అతడి జెర్సీని ప్రదర్శించడం తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. 
 
రిషబ్‌ జెర్సీని ఇలా డగౌట్లో ఉంచొద్దని ఢిల్లీ ఫ్రాంఛైజీకి బీసీసీఐ సూచించినట్లు తెలిసింది. 'డగౌట్‌పై పంత్‌ జెర్సీని వేలాడదీయడం బాగోలేదు. ఏదైనా విషాదం లేదా రిటైర్‌మెంట్‌ సమయంలోనే ఇలాంటివి చూస్తాం. పంత్‌ క్షేమంగా ఉన్నాడు. ఊహించి దానికంటే వేగంగా కోలుకుంటున్నాడు. ఒక మంచి ఆలోచనతోనే ఢిల్లీ ఈ పని చేసినా.. ఇలాంటి చర్యలు మానుకోవాలని' బీసీసీఐ సూచించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments