Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో సందడి చేసిన రిషబ్ పంత్

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (09:58 IST)
ఐపీఎల్ 2023 సీజన్‌లో భారత క్రికెటర్ రిషబ్ పంత్ సందడి చేశాడు. గత యేడాది ఆఖరులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్.. ప్రస్తుతం కొంతమేరకు కోలుకున్నారు. ముఖ్యంగా ఆయన మోకాలికి ఆపరేషన్ చేయడంతో నిరవధికంగా ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో సందడి చేశారు. 
 
మంగళవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ - గుజరాత్ జట్ల మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన ఊతకర్ర సాయంతో ఆడియన్స్ గ్యాలెరీలో కనిపించారు. బీసీసీఐ ఉన్నతాధికారులు కూర్చునే గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ ఢిల్లీ కెప్టెన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కావడంతో లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో డీసీ జట్టు డగౌట్లో అతడి జెర్సీని ప్రదర్శించడం తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. 
 
రిషబ్‌ జెర్సీని ఇలా డగౌట్లో ఉంచొద్దని ఢిల్లీ ఫ్రాంఛైజీకి బీసీసీఐ సూచించినట్లు తెలిసింది. 'డగౌట్‌పై పంత్‌ జెర్సీని వేలాడదీయడం బాగోలేదు. ఏదైనా విషాదం లేదా రిటైర్‌మెంట్‌ సమయంలోనే ఇలాంటివి చూస్తాం. పంత్‌ క్షేమంగా ఉన్నాడు. ఊహించి దానికంటే వేగంగా కోలుకుంటున్నాడు. ఒక మంచి ఆలోచనతోనే ఢిల్లీ ఈ పని చేసినా.. ఇలాంటి చర్యలు మానుకోవాలని' బీసీసీఐ సూచించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవ్వు నాలుగు విధాల చేటు కాదు.. మేలు.. నవ్వుతోనే ఆరోగ్యం

జులై 1న నేషనల్ డాక్టర్స్ డే - జాతిపిత స్నేహితుడి గౌరవార్థం.. థీమ్ ఇదే..

దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు.. మధ్యప్రదేశ్‌లో తొలి కేసు నమోదు!!

వామ్మో.. బస్సులు, రైళ్లలో ఒకటే జనం.. ఏపీ ప్రజలకు ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

తర్వాతి కథనం
Show comments