Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేరియుపోల్‌ను వశం చేసుకున్న రష్యా సేనలు

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:25 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. గత ఫిబ్రవరి నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని కీలక నగరాల్లో ఒకటే మేరియుపోల్‌ను రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. దీంతో ఆ నగరానికి ఉక్రెయిన్ నుంచి విముక్తి లభించిందంటూ పుతిన్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో పుతిన్ జరిపిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మేరియుపోల్‌ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ విషయంలో మిమ్మల్నందరినీ అభినందిస్తున్నానని చెప్పారు. 
 
ఇక ఆ ప్రాంతంపై దాడులు చేయాల్సిన అవసరం లేదని పుతిన్ రష్యా సైన్యాధిపతికి సూచించారు. గత ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం వారం రోజుల్లోనే ఉక్రెయిన్‌ను తమ దారికి తెచ్చుకోవన్న రష్యా సైనికుల అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితంగా రష్యా అపారమైన సైనిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. 
 
ఇదిలావుంటే, మేరియుపోల్‌ను కైవసం చేసుకోవడం రష్యాకు అత్యంత కీలకం. ఎందుకంటే రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన డాన్ బాస్‌కు మధ్యలో మేరియుపోల్ ఉంది. ఇపుడు మేరియుపోల్ రష్యా వశం కావడంతో క్రిమియా, డాన్‌బాస్ మధ్య. భూమార్గంలో రాకపోకలను రష్యా సాఫీగా చేపట్టేందుకు వీలుపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments