Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోర్డాన్‌లో టాక్సిగ్ యాసిడ్ లీక్ - 12 మంది మృతి

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (15:16 IST)
జోర్డాన్ దేశంలోని అఖ్వాబా నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్‌ కిందపడటంతో ఈ పేలుడు జరిగింది. ఇందులో నుంచి టాక్సిక్ యాసిడ్ లీక్ కావడంతో కావడంతో దాన్ని పీల్చి 12 మంది చనిపోగా, 250 మంది వరకు గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జరుగగా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. 
 
అఖ్వబా పోర్టులో ట్యాంకులను నౌకల్లో లోడింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఒక కంటైనర్ షిప్ కిందపడిపోయింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ముదురు పసుపు రంగులో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 
 
ఇది క్లోరిన్ వాయువుగా గుర్తించారు. దీన్ని పీల్చడం వల్ల 12 మంది ప్రాణాలు విడిచారు. మరో 250 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
రసాయనాన్ని నిల్వవుంచే కంటెయినర్‌ని తరలిస్తున్న సమయంలోనే క్రెయిన్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోర్డాన్ ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments