Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా ముదిరిన మహారాష్ట్ర సంక్షోభం : షిండే గూటికిన 14 మంది ఎంపీలు?

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (14:32 IST)
మహారాష్ట్ర రాజకీయం మరింత సంక్షోభం దిశగా పయనిస్తుంది. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు శివసేనపై తిరుగుబావుటా ఎగురవేయడంతో పార్టీ చీలిక దిశగా సాగుతుండగా.. తాజాగా 14 మంది ఎంపీలు కూడా రెబల్స్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
శివసేన పార్టీకి లోక్‌సభలో 19 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 14 మంది ఏక్‌నాథ్‌ షిండే, భాజపాతో టచ్‌లో ఉన్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీరంతా షిండే వర్గంలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. అదే నిజమైతే, శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం ప్రయత్నిస్తోన్న షిండేకు మరింత బలం చేకూరినట్లవుతుంది.
 
మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది సభ్యులున్నారు. వీరిలో 39 మంది తిరుగుబాటు చేశారు. వీరికి షిండే నాయకత్వం వహిస్తున్నారు. దీంతో అసలైన శివసేన పార్టీ తమదేనని, అసెంబ్లీలో తమ వర్గాన్నే శివసేనగా గుర్తించాలని షిండే కోరుతున్నారు. 
 
ఇదే విషయమై త్వరలోనే ఆయన గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీలు కూడా శిందేకు మద్దతిచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments