Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లిలో పేలుడు

blast
, ఆదివారం, 26 జూన్ 2022 (13:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లిలో శనివారం పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా బహదూర్ పల్లిలోని ఒక కన్వెన్షన్ హాలులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నమహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈమెను కామారెడ్డికి చెందిన లక్ష్మిగా గుర్తించారు. ఈమె తన భర్త జయరాజ్‌తో కలిసి బహుదూర్ పల్లిలోని ఎస్‌బీ‌వీ‌కే ఫంక్షన్ హాలులో సెక్యూరిటీ ఉంటూ పని చేస్తున్నారు.
 
శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ డబ్బాను కడిగేందుకు లక్ష్మి ప్రయత్నించగా… ఆ డబ్బా నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆమె శరీరం ఛిద్రమై రక్తపు మడుగులో పడి చనిపోయింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు క్లూస్ టీం తో ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డబ్బాలో ఏముంది అనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్మనీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ