Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారణాసి బాంబు పేలుళ్ళ కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

hang
, మంగళవారం, 7 జూన్ 2022 (08:46 IST)
గత 2006లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన వలీ ఉల్లా ఖాన్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో వలీ ప్రధాన సూత్రధారి కావడంతో ఆయనకు ఘజియాబాద్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. 
 
2006లో జరిగిన ఈ పేలుళ్లలో 20 మందికిపై అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా వంద మందికిపై గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా, కేసు విచారణ ఘజియాబాద్ కోర్టులో సాగింది. ఈ మూడు కేసుల్లో ఏ1గా వలీ ఉన్నారు. ఇందులో తొలి కేసులో ఉరిశిక్ష విధించగా, రెండో కేసులో జీవిత ఖైదు, జరిమానా విధించింది. 
 
మూడో కేసులో సరైన సక్ష్యాధారాలు లేకపోవడంతో వలీని నిర్దోషిగా విడుదల చేసింది. వారణాసి పేలుళ్ల తర్వాత ఈ కేసులో వలీ తరపున విచారించేందుకు ఏ ఒక్క న్యాయవాది ముందుకురాలేదు. దీంతో ఈ కేసు విచారణను ఘజియాబాద్ కోర్టుకు అలహాబాద్ కోర్టు బదిలీ చేసింది. ఇపుడు ఈ కేసు కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4న పెళ్లి - 5న రిసెప్షన్ - 6న వరుడు ఆత్మహత్య - ఎక్కడ?