Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి రెడీ.. అణుబాంబులున్న దేశాలే: ట్రంప్

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (11:21 IST)
కాశ్మీర్‌ సమస్య విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధంగానే ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు రెండూ కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు. కాశ్మీర్ అంశంపై అవసరమైన సాయం చేయగలుగుతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా విషమంగా ఉందని, త్వరలో బాగుపడుతుందని భావిస్తున్నానన్నారు. 
 
ఇరు దేశాల ప్రధానులు తనకు మంచి స్నేహితులని చెప్పుకొచ్చారు. రెండు దేశాలు అణుబాంబులున్న దేశాలని, వారే సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. కాశ్మీర్‌ సమస్య భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక అంశమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. 
 
ఇరు దేశాలూ కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోగలవని ఆయన చెప్పారు. మూడవ దేశం జోక్యం అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. త్వరలో భారత్‌, పాకిస్తాన్‌లు కలుస్తాయని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments