Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధిమార్చుకోని తాలిబన్ తీవ్రవాదులు : మహిళల వాయిస్ బంద్

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (17:06 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత శాంతిపలుకులు పలికిన తాలిబన్ తీవ్రవాదులు.. ఆచరణలో మాత్ర తమ బుద్ధిని మార్చుకోలేదు. ఫలితంగా తమ కఠినమైన షరియా చట్టాలను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తున్నారు. సంగీతం లేదా పాటలు,  టీవీలు, రేడియో ఛానళ్లలో ఆడవాళ్ల వాయిస్‌ని బ్యాన్ చేయాలని కాందహార్‌లోని టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లను తాలిబన్ ఆదేశించింది. 
 
వాస్తవానికి తాము పూర్తిగా మారిపోయామని, ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు.. మహిళలు చదువుకోవచ్చు.. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు వారు అంగీకరించడం లేదు. 
 
కాగా, ఆగస్టు 15వ తేదీన తాలిబన్లు అప్ఘానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పలు మీడియా సంస్థలు తమ ఫీమేల్ (ఆడవాళ్లు) యాంకర్లను తొలగించిన కొద్ది రోజుల్లోనే తాలిబన్ నుంచి ఈ ఆదేశాలు రావడం గమనార్హం. ఇక,పలువురు మీడియా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు కూడా ఇటీవల అప్ఘానిస్తాన్ వదిలి పారిపోయినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments