Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధిమార్చుకోని తాలిబన్ తీవ్రవాదులు : మహిళల వాయిస్ బంద్

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (17:06 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత శాంతిపలుకులు పలికిన తాలిబన్ తీవ్రవాదులు.. ఆచరణలో మాత్ర తమ బుద్ధిని మార్చుకోలేదు. ఫలితంగా తమ కఠినమైన షరియా చట్టాలను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తున్నారు. సంగీతం లేదా పాటలు,  టీవీలు, రేడియో ఛానళ్లలో ఆడవాళ్ల వాయిస్‌ని బ్యాన్ చేయాలని కాందహార్‌లోని టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లను తాలిబన్ ఆదేశించింది. 
 
వాస్తవానికి తాము పూర్తిగా మారిపోయామని, ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు.. మహిళలు చదువుకోవచ్చు.. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు వారు అంగీకరించడం లేదు. 
 
కాగా, ఆగస్టు 15వ తేదీన తాలిబన్లు అప్ఘానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పలు మీడియా సంస్థలు తమ ఫీమేల్ (ఆడవాళ్లు) యాంకర్లను తొలగించిన కొద్ది రోజుల్లోనే తాలిబన్ నుంచి ఈ ఆదేశాలు రావడం గమనార్హం. ఇక,పలువురు మీడియా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు కూడా ఇటీవల అప్ఘానిస్తాన్ వదిలి పారిపోయినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments