Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్న పీవీ కుమార్తె

Advertiesment
Dalita Bandhu
, ఆదివారం, 29 ఆగస్టు 2021 (10:27 IST)
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఆదివారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సురభి వాణి గత మార్చి నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెల్సిందే.
 
కానీ, ఆమె ఇంతవరకు ప్రమాణస్వీకారం చేయలేదు. దీంతో ఆదివారం ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సురభి వాణీదేవి చేత ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. విద్యాసంస్థల అధిపతిగా ఉన్న వాణిదేవి చట్ట సభల్లోకి అడుగు పెట్టబోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పహీ మచ్‌మచ్‌ను చంపేసిన కరోనా వైరస్