Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌పై దండయాత్ర - 500 మంది రష్యా సైనికుల మృతి

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (08:34 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టిన రష్యా తన సైనికులను భారీగానే కోల్పోతోంది. దీనిపై తొలిసారి అధికారిక ప్రకటన చేసింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 500 మంది సైనికులను కోల్పోయినట్టు అధికారంగా ప్రకటించింది. మర 1600 మంది సైనికులు గాయపడినట్టు పేర్కొంది. అయితే, ఉక్రెయిన్ మాత్రం ప్రాణాలు కోల్పోయిన రష్యా సైనికుల సంఖ్య వేలల్లో ఉంటుందని వెల్లడించింది. ఈ వార్తలను రష్యా కొట్టివేస్తూ 500 మంది చనిపోయారంటూ ఓ ప్రకటన చేసింది. 
 
మరోవైపు, గత 9 రోజులుగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా బలగాలకు ఇపుడే పట్టు చిక్కుతుంది. ఉక్రెయిన్‌లోని కీలకమైన ఖేర్సన్ ఓడరేవును పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు రష్యా ప్రకటించింది. 
 
ఈ ఓడరేవును సొంతం చేసుకుని తీరంతో దేశానికి సంబంధాలు తెగిపోయేలా చేసేందుకు వారం రోజులుగా చేస్తున్న రష్యా ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. అంతేకాదు, ఓడరేవు పాలనా యంత్రాంగాన్ని కూడా రష్యా అదుపులోకి తీసుకున్నట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
 
మరియుపొల్, ఖర్కివ్ నగరాలను కూడా రష్యా దిగ్బంధించింది. ఈ నగరంలోకి చొచ్చుకుపోయేందుకు రష్యన్ దళాలు మరింతగా ప్రయత్నిస్తున్నాయి. రాకెట్లు, క్షిపణుల దాడులను ముమ్మరం చేశాయి. 
 
మరోవైపు, ఉక్రెయిన్‌లోని చెర్నిహైవ్‌లోని ఆసుపత్రిపై రెండు క్రూయిజ్ క్షిపణులు దాడిచేశాయి. ఇక్కడ జరిగిన ప్రాణ, ఆస్తినష్టం గురించి తెలియాల్సి ఉంది. కీవ్, ఖర్కివ్‌లపైనా దాడులు జరుగుతున్నాయి. మరియుపొల్ పాఠశాల సమీపంలో ఫుట్‌బాల్ ఆడుతున్న వారిపైనా రష్యన్ బలగాలు బాంబులు కురిపించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments