Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని అటెన్షన్ కోసం 'మొఘల్స్' అనే పదం వాడివుండొచ్చు: ఓవైసీ

Advertiesment
Owaisi
, గురువారం, 3 మార్చి 2022 (10:34 IST)
ఉక్రెయిన్‌లోని రష్యా దాడిలో మరణించిన నవీన్ మృతిపట్ల భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి పోలిఖా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గతంలో రష్యా దళాలు కేవలం మిలటరీ స్థావరాలపైనే దాడులు చేసేవారని, ఇప్పుడు పౌరులపై కూడా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. 
 
రాజ్‌పుత్‌లపై మొఘలులు చేసిన దాడిలా ఇది ఉందంటూ ఆయన అభివర్ణించారు. రష్యా దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ మృతి చెందిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉక్రెయిన్ రాయబారికి సమన్లు పంపింది. 
 
ఈ నేపథ్యంలో భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. పరిపక్వత లేని మధ్యయుగ జ్ఞానాన్ని తన వద్దే ఉంచుకుంటే మంచిదంటూ ఒవైసీ మండిపడ్డారు.
 
ఉక్రెయిన్‌లో జరుగుతున్న దానికి ఆయన అభివర్ణించడానికి సంబంధం లేదని..  ప్రధాని మోదీ అటెన్షన్ కోసం 'మొఘల్స్'ను ఉపయోగించుకోవాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చిందో ఏమో?’ అంటూ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూఎస్ జనరల్ అసెంబ్లీలో రష్యాపై తీర్మానం.. ఓటింగ్‌కు దూరంగా భారత్