Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు రాక

ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు రాక
, గురువారం, 3 మార్చి 2022 (13:57 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధంలో చిక్కుకున్న భారత పౌరులను, విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. తొలుత ఎయిర్ ఇండియా విమానాలను రంగంలోకి దిగిన భారత్... ఏకంగా వైమానికి దళానికి చెందిన సి-17 విమానాలను ఉపయోగిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉక్రెయిన్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఏకంగా 19 విమానాల్లో 3,726 మంది విద్యార్థులు స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అనేక వందల మంది విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మరికొంతమంది సాయంత్రం లోపు మాతృభూమికి చేరుకోనున్నారు. 
 
ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను రోడ్డు మార్గంలో సరిహద్దులు తరలించి, అక్కడ నుంచి ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, రోమేనియా, బొలీవియా వంటి దేశాల నుంచి తరలిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, 8 విమానాలు బుకారెస్ట్ నుంచి మరో రెండు విమానాలు సుసేవ నుంచి కోసీ నుంచి ఒకటి, బుడాపెస్ట్ నుంచి ఐదు, రెస్టోవ్ నుంచి మూడు విమానాలు బయలుదేరుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖాకమంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు. ప్రధాని ఆదేశాలతో ఒక్క రోజులోనే 3726 మందిని స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీ అడ్డాలో సీఎం కేసీఆర్.. భారీ స్వాగత ఏర్పాట్లు