Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌పై రాకెట్ దాడులకు పాల్పడిన పాకిస్థాన్

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (11:02 IST)
ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన కునార్‌లోని షెల్టాన్ జిల్లాలో పాకిస్థాన్ సైన్యం రాకెట్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని ప్రాంతీయ సమాచారం సంచాలకులు నజీబుల్లా హసన్ అబ్దాల్ వెల్లడించారు. 
 
ఈ దాడి నేపథ్యంలో తాలిబాన్ అధికారులు పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గత సంవత్సరం ఆఫ్గనిస్థాన్‌ను తాలిబాన్లు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుండి పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఆఫ్గన్ ప్రాంతం నుంచి మిలిటెంట్ గ్రూపులు తమ దేశంపై దాడికి యత్నిస్తున్నాయని పాకిస్థాన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ప్రధానంగా పాకిస్థానీ తీవ్రవాదులకు తాలిబాన్లు ఆశ్రయం ఇవ్వడాన్ని పాక్ తప్పబడుతుంది. దీనికితోడు పాకిస్థాన్, ఆప్గాన్ దేశాల మధ్య 2,700 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ అని పిలిచే సరిహద్దు ఉంది. దీనిని ఆక్రమించుకొనేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్ ఆరోపిస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments