Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనాల మధ్య ఘర్షణ - తోకముడిచిన డ్రాగన్ సైన్యం

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (12:31 IST)
డ్రాగన్ దేశం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. తూర్పు ల‌డఖ్‌లో మ‌ళ్లీ సైనికుల‌ను త‌ర‌లిస్తూ చైనా మ‌రోసారి దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంది. దీంతో చైనా సైనికుల‌ను ఎదుర్కొనేందుకు భార‌త సైన్యం కూడా ధీటుగా స్పందించింది. దీంతో చైనా సైనికులు తోకముడిచి అక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. 
 
మ‌రోవైపు, అరుణాచ‌ల్ సెక్టార్‌లోనూ చైనా రెచ్చ‌గొట్టే చర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య కొన్ని గంట‌ల పాటు ఘ‌ర్ష‌ణ వాతావరణం చోటుచేసుకుంది. కొన్ని గంట‌ల పాటు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.
 
అరుణాచ‌ల్ సెక్టార్‌లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న గురించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. శాంతి మంత్రం జ‌పిస్తూనే ఇప్పుడు తూర్పు ల‌డ‌ఖ్‌తో పాటు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సెక్టార్ వ‌ద్ద కూడా చైనా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.
 
భారత బలగాలు సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా 200 మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపానికి రావడాన్ని గుర్తించారు. వీరు ఎల్ఐసీని దాటేందుకు ప్రయత్నించగా భారత్ సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఇరు దేశాలు వాస్తవాధీన రేక నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments