Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనాల మధ్య ఘర్షణ - తోకముడిచిన డ్రాగన్ సైన్యం

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (12:31 IST)
డ్రాగన్ దేశం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. తూర్పు ల‌డఖ్‌లో మ‌ళ్లీ సైనికుల‌ను త‌ర‌లిస్తూ చైనా మ‌రోసారి దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంది. దీంతో చైనా సైనికుల‌ను ఎదుర్కొనేందుకు భార‌త సైన్యం కూడా ధీటుగా స్పందించింది. దీంతో చైనా సైనికులు తోకముడిచి అక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. 
 
మ‌రోవైపు, అరుణాచ‌ల్ సెక్టార్‌లోనూ చైనా రెచ్చ‌గొట్టే చర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య కొన్ని గంట‌ల పాటు ఘ‌ర్ష‌ణ వాతావరణం చోటుచేసుకుంది. కొన్ని గంట‌ల పాటు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.
 
అరుణాచ‌ల్ సెక్టార్‌లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న గురించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. శాంతి మంత్రం జ‌పిస్తూనే ఇప్పుడు తూర్పు ల‌డ‌ఖ్‌తో పాటు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సెక్టార్ వ‌ద్ద కూడా చైనా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.
 
భారత బలగాలు సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా 200 మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపానికి రావడాన్ని గుర్తించారు. వీరు ఎల్ఐసీని దాటేందుకు ప్రయత్నించగా భారత్ సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఇరు దేశాలు వాస్తవాధీన రేక నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments