Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత జాలర్లపై రాళ్లు విసిరిన శ్రీలంక నేవీ.. 20 వలలను..?

భారత జాలర్లపై రాళ్లు విసిరిన శ్రీలంక నేవీ.. 20 వలలను..?
, గురువారం, 7 అక్టోబరు 2021 (19:12 IST)
శ్రీలంక నేవీ మరోమారు చెలరేగిపోయింది. భారత జాలర్లపై రాళ్లు విసిరి వారి వలలను ధ్వంసం చేసింది. కచ్చతీవు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పది ఫిషింగ్ బోట్లలో వచ్చిన శ్రీలంక నేవీ అధికారులు జాలర్లపై రాళ్లు రువ్వారని, దాదాపు 20 వలలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అక్కడ వేటాడవద్దని హెచ్చరించాన్నారు. 
 
అయితే, ఈ ఘటనలో జాలర్లు ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై అధికారుల వద్ద ఫిర్యాదు నమోదైంది. భారత జాలర్లపై శ్రీలంక నేవీ దాడులు సర్వసాధారణమైపోయాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని జాలర్ల సంఘాల ప్రతినిధులు అధికారులను కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవలా రచయిత అబ్దుల్‌రజాక్ గుర్నాహ్‌కు నోబెల్ పురస్కారం