Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:06 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 21,257 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,15,569కి చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇందులో 2,40,221 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,32,25,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,50,127 మంది వైరస్‌ వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 24,963 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడగా, 271 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులుగా మైనర్ బాలికపై అత్యాచారం... ఎక్కడ?