Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్‌‌ కేసులో పాకిస్థాన్ అలా చేస్తోంది..

Webdunia
గురువారం, 23 జులై 2020 (22:35 IST)
భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిలిటరీ కోర్టు తీర్పుపై అపీలు చేయవలసి ఉంది. అయితే ఈ కేసులో చట్టపరమైన అన్ని అవకాశాలను పాకిస్థాన్ అడ్డుకుంటోందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, జూలై 16న భారత దేశ కాన్సులర్ ఆఫీసర్లు జాదవ్‌ను కలిసినపుడు పాకిస్థాన్ అధికారులు అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ కేసు పట్ల పాకిస్థాన్ వ్యవహార శైలి ఓ ప్రహసనంగా ఉందని పేర్కొన్నారు. జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీ తీసుకోవడానికి సైతం భారత దేశానికి అవకాశం ఇవ్వలేదన్నారు.
 
జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీని తీసుకోలేకపోవడం వల్ల మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని ఈ కేసులో భారత్ తరపున వాదిస్తున్న పాకిస్థానీ లాయర్ చెప్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి అనుసరించదగిన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments