Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిక్‌టాక్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్.. బిగోను బ్యాన్ చేసేసింది..!

టిక్‌టాక్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్.. బిగోను బ్యాన్ చేసేసింది..!
, మంగళవారం, 21 జులై 2020 (16:23 IST)
పాకిస్థాన్ టిక్‌టాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. పబ్జీ వీడియో గేమ్‌ను నిషేధించిన పాకిస్థాన్.. ప్రస్తుతం టిక్‌టాక్‌పై పడింది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందనే కారణంతో పబ్జీని నిషేధించిన పాకిస్థాన్‌.. టిక్‌టాక్‌పై కూడా అదే అభియోగాన్ని మోపుతోంది. టిక్‌టాక్‌లో అసభ్యత, అశ్లీలత హద్దులు దాటకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డైన్స్‌‌ను ఆదేశించింది. 
 
పబ్జీ, టిక్‌టాక్‌లే కాకుండా సోషల్‌ మీడియాలోని పలు యాప్‌లలో అసభ్యకరంగా కంటెంట్‌ ఉంటుందని ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని పాకిస్థాన్‌ టెలి కమ్యూనికేషన్స్‌ అథారిటీ చెప్తోంది. టిక్ టాక్‌లో అలాగే బిగోలోనే అడల్ట్ కంటెంట్ అధికంగా వుంటుందని పాకిస్థాన్ టెలి కమ్యూనికేషన్స్ అథారిటీ తెలిపింది. ఈ కారణంగా యువత చెడుదారిన పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది. 
 
ఇప్పటికే ఈ విషయమై ఆయా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేశామని పేర్కొంది. ఇప్పటికే బిగోను నిషేధించామని, టిక్‌టాక్‌కు ఆఖరి హెచ్చరిక జారీ చేశామని, టిక్‌టాక్‌లో మితిమీరుతున్న అశ్లీలతను, అసభ్యతను, అనైతిక వీడియోలను నియత్రించేందుకు సమగ్రమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించామని పాక్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ అథారిటీ చెబుతోంది. దీంతో బిగోను బ్యాన్ చేసిన పాకిస్థాన్.. టిక్ టాక్‌కు మాత్రం ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ లేని దేశాలు ఏవి?