Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌‍లో ఆల్‌టైమ్ గరిష్టానికి పెట్రోల్ - గ్యాస్ ధరలు

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (12:36 IST)
పాకిస్థాన్ దేశంలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. పెట్రోల్, గ్యాస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో పాటు నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. తాజాగా ఇంధన ధరలను మళ్లీ పెంచడంతో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.272కు చేరింది. 
 
పాకిస్థాన్ దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయి. దీంతో విదేశీ నిధుల కోసం పాకిస్థాన్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే, నిధుల విడుదలకు ఐఎంఎఫ్ విధించిన నిబంధనల మేరకు పాక్ ఈమారు పెట్రోల్ ధర ఏకంగా రూ.22.20కి మేరకు పెంచింది. 
 
పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు కూడా పెంచడంతో లీటర్ రూ.280కు చేరుకుంది. లీటర్‌కి కిరోసిన్ ధర రూ.202.70కి చేరుకుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పాకిస్థాన్‌ను నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆర్థిక క్రమశిక్షణ పేరిట పాక్ ప్రభుత్వానికి పలు నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల మినీ బడ్జెట్‌లో పన్నులను పెంచింది. ఈ యేడాది ప్రథమార్థంలో పాక్ ద్రవ్యోల్బణంగా గరిష్టంగా 33 శాతానికి చేరుకుని ఆపై గ్గడం ప్రారంభిస్తుందని అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments