Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం - 39 మంది వలసదారుల మృతి

road accident
, గురువారం, 16 ఫిబ్రవరి 2023 (11:56 IST)
అమెరికాలోని పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో ఏకంగా 39 మంది వలసదారులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 66 మంది ఉన్నారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో ఏడుగురు పారిపోయారు. 
 
అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని శరణార్థులుగా గుర్తించి ప్రత్యేక శిబిరాలకు తరలిస్తుంటారు. ఆ విధంగానే 66 మంది శరణార్థులను ఒక బస్సులో తరలిస్తుండగా, ప్రమాదవశాత్తు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులోని 39 మంది వలసదారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘాట్‌ రోడ్డులో వెళుతుండగా బస్సు అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. 
 
ఇటీవల కొలంబియా నుంచి 66 మంది వలసదారులు అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశించారు. వీరందరినీ సరిహద్దు వద్ద విధుల్లో ఉండే సైనికులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారందరినీ గౌలాకా శరణార్థ శిబిరానికి తరలిస్తుండగా ఘాట్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించేక్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన తర్వాత ఏడుగురు వలసదారులు పారిపోయారు. వారికోసం అమెరికా పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్ లోయలో స్కేటింగ్ చేస్తూ.. హాయిగా రాహుల్ గాంధీ