Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాతో చేతులు కలిపి నష్టపోయాం.. తటస్థంగా ఉండాల్సింది : ఇమ్రాన్ ఖాన్

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (11:15 IST)
అగ్రరాజ్యం అమెరికాతో చేతులు కలిసి తీవ్రంగా నష్టపోయినట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అమెరికాతో కలిసి పని చేయకుండా తటస్థంగా ఉండివుండాల్సింది అని చెప్పుకొచ్చారు. 
 
న్యూయార్క్‌లో జరిగిన విదేశీ సంబంధాల మండలి (సీఎఫ్‌ఆర్‌) మేధోవర్గం సదస్సులో ఇమ్రాన్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 18 యేళ్ళ క్రితం అంటే 2001 సెప్టెంబర్‌ 11న ఆల్‌ఖైదా ఉగ్రవాదులు న్యూయార్క్‌ మన్‌హట్టన్లోని వాణిజ్య భవనాలు (డబ్య్లూటీసీ) ట్విన్‌ టవర్స్‌పై విమానాలతో దాడులు చేసి కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 2,976 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 6 వేల మంది గాయపడ్డారు.
 
అమెరికాలాంటి అగ్రరాజ్యం ఈ దాడులతో చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు అమెరికా పలు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా పాకిస్థాన్‌ సైనిక స్థావరాల సమీపంలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న ఆల్‌ఖైదా చీఫ్‌ ఒసామాబిన్‌ లాడెన్‌ను పట్టుకుని చంపేసింది.
 
2011, మే 2వ తేదీన అమెరికా దళాలు అర్థరాత్రి లాడెన్‌ ఇంటిపై దాడిచేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ సైన్యానికి తెలిసే ఇదంతా జరిగిందన్నది అప్పటి చర్చ. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ 9/11 తర్వాత సంఘటనలపై ఇప్పుడు వాపోవడం చర్చనీయాంశమైంది. 
 
ఉగ్రవాదంపై పోరుకోసం అమెరికాతో చేతులు కలపకుండా తటస్థంగా ఉండాల్సిందని, చేతులు కలిపి భారీ మూల్యం చెల్లించుకున్నామని ఇమ్రాన్‌ వాపోయారు. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
మరోవైపు, ఇమ్రాన్‌తో జరిగిన సమావేశంలో కాశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే పాక్ ప్రధానమంత్రి ఈ తరహా మాటలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments