Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ ఊచకోతకు దిగవచ్చు... పాక్ పౌరులకు ఇమ్రాన్ హెచ్చరిక

భారత్ ఊచకోతకు దిగవచ్చు... పాక్ పౌరులకు ఇమ్రాన్ హెచ్చరిక
, గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:41 IST)
పాకిస్థాన్ దేశపౌరులకు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత్ ఊచకోతకు దిగే అవకాశం ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. కాశ్మీర్ జిహాదీ కోసం ఎవరైనా వెళ్తే.. వాళ్లు (భారత్) ఆ ప్రాంతాన్ని మరింత జఠిలం చేసినవారవుతారన్నారు. 
 
ఇటీవల కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం అధికరణ 370ని రద్దు చేసింది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, పాకిస్థానీలు జిహాదీ కోసం కాశ్మీర్ దిశ‌గా వెళ్తే.. ఆ సాకు చూసుకుని భార‌త్ ఆ ప్రాంతంలో తీవ్ర ఊచ‌కోతకు దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇమ్రాన్ హెచ్చరించారు. 
 
త‌మ దేశం కాశ్మీరీల వెంట ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. పాక్ నుంచి ఎవ‌రైనా ఫైట్ చేసేందుకు భారత్‌కు వెళ్తే.. అప్పుడు కాశ్మీరీల‌కు అన్యాయం చేసిన మొద‌టి వ్య‌క్తి వారే అవుతార‌న్నారు. వాళ్లే కాశ్మీరీల‌కు శ‌త్రువుల‌వుతార‌ని ఇమ్రాన్ త‌మ దేశ జిహాదీల‌ను హెచ్చ‌రించారు. ఆఫ్ఘ‌నిస్తాన్ స‌రిహ‌ద్దులో ఉన్న తోర్క‌మ్ అనే ప్రాంతంలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఈ హెచ్చ‌రిక‌లు చేశారు. చిన్న పొర‌పాటు చేసినా.. అప్పుడు భార‌త బ‌ల‌గాలు చిత్రహింస‌కు దిగుతాయ‌ని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ?