Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియాలో బాహుబలి క్షిపణి... సైనిక పరేడ్‌లో ప్రదర్శన

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (16:44 IST)
ఉత్తర కొరియా రక్షణశాఖ బాహుబలి క్షిపణిని తయారు చేసింది. దీన్ని శనివారం జరిగిన సైనిక పరేడ్‌లో ప్రదర్శించింది. ఆ దేశ అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా నిర్వహించిన సైనిక పెరేడ్ లో భారీ క్షిపణిని ప్రదర్శించారు. ఇది ఖండాంతర అణుక్షిపణిగా భావిస్తున్నారు. దీని సైజు దృష్ట్యా అంతర్జాతీయ మీడియాలో రాక్షస క్షిపణి అని అభివర్ణిస్తున్నారు. 
 
కాగా ఓ పెరెడ్‌లో బహిరంగంగా ప్రదర్శించిన మిస్సైళ్లలో ఇదే అతిపెద్దది అని అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య పేర్కొంది. ఈ బాహుబలి క్షిపణికి అమెరికా రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.
 
కాగా, ఈ సైనిక ప్రదర్శనకు ఉత్తర కొరియా సైనికులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్న కూడా పెరేడ్‌లో పాల్గొన్నట్టు అక్కడి అధికారిక మీడియా ఓ వీడియో విడుదల చేసింది. భారీ మిస్సైల్ వాహనం వెళుతుండగా కిమ్ జాంగ్ ఉన్ అభివాదం చేస్తుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments