ఉ.కొరియాలో అణుప్రమాదం.. 200 మంది మృత్యువాత

ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (06:21 IST)
ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ విషయాన్ని జపాన్‌ మీడియా అధికారికంగా వెల్లడించింది. గత నెల 10వ తేదీన మిలిటరీ సైట్‌ వద్ద నిర్మాణ పనులు చేపట్టుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయినట్లు పేర్కొంది. తొలుత సొరంగంలో 100 మంది చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపడుతుండడంతో మిగిలిన భాగం వారిపై కూలిపోయింది.
 
దాంతో మరో 100 మంది మృత్యువాతపడ్డారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఉ.కొరియా అధికారులు స్పందించలేదు. ఇటీవల ఉత్తర కొరియా అతపెద్ద హైడ్రోజన్‌ బాంబ్‌ను పరీక్షించడంతో ఆ ప్రదేశం మొత్తం దెబ్బతింది. దాంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని జపాన్‌ మీడియా వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాపై కయ్యానికి కాలుదుతున్న ఉ.కొరియాకు ఈ ఘటన గట్టి ఎదురుదెబ్బే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments