Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లవర్ కోసం భర్తను చంపాలని విషం కలిపింది... కానీ 14 మంది...

ఇష్టం లేని వ్యక్తితో సంసారం దినదిన గండంగా మారుతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆ సంసారంలో చోటుచేసుకుని వుంటుంది. ఐతే ఖచ్చితంగా భర్త లేదంటే భార్య ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడే పరిస్థితి తలెత్తుతుందని గత సంఘటనలు పట్టి చూపించాయి. తాజాగా ఇలాంటి ఘటన

లవర్ కోసం భర్తను చంపాలని విషం కలిపింది... కానీ 14 మంది...
, మంగళవారం, 31 అక్టోబరు 2017 (19:11 IST)
ఇష్టం లేని వ్యక్తితో సంసారం దినదిన గండంగా మారుతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆ సంసారంలో చోటుచేసుకుని వుంటుంది. ఐతే ఖచ్చితంగా భర్త లేదంటే భార్య ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడే పరిస్థితి తలెత్తుతుందని గత సంఘటనలు పట్టి చూపించాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
 
ఓ యువతి ఆల్రెడీ ఓ ప్రియుడితో ప్రేమాయణ సాగిస్తోంది. ఐతే ఆమె తల్లిదండ్రులు దాన్ని అంగీకరించలేదు. మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకు భర్తతో కాపురం చేయడం ఇష్టంలేక అతడినే హతమార్చేందుకు ప్లాన్ చేసింది ఓ భార్య. అదికాస్తా బెడిసికొట్టింది. 13 మంది ప్రాణాలను తీసింది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని ముజఫర్ జిల్లాలో జరిగింది. గత సెప్టెంబర్‌ నెలలో ఆసియా బీబీ అనే యువతికి ఇష్టం లేని పెళ్లి చేశారు.
 
పెళ్లయిన తర్వాత తనకి ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పి వస్తే పుట్టింటివారు ఏమంటారోనని ఏకంగా భర్తనే చంపేసి ప్రియుడితో వెళ్లిపోవాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లే భర్తకు పాలలో విషం కలిపి ఇచ్చింది. ఐతే ఆ పాలను అతడు తాగలేదు. ఆ పాలను అలాగే వుంచేసింది. అది కాస్తా పెరుగుగా మారింది. ఇంతలో భర్త ఇంటికి బంధువులు వచ్చారు. ఆ బంధువులకు విషం కలిసిన పెరుగును లస్సీగా చేసి భర్తతో పాటు అతడి బంధువులకూ ఇచ్చేసింది. దానితో వారంతా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 13 మంది అక్కడికక్కడే చనిపోగా మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఆ నిర్ణయం విని వైకాపా నేతలు గొణుక్కుంటున్నారట...