Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సబ్‌మెరైన్లను ధ్వంసం చేసే యుద్ధ విమానాలు.. పాకిస్థాన్‌కు భారత్ చెక్ పెడుతుందా?

పాకిస్థాన్ చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సమాయత్తమవుతోంది. భారత్ పట్ల దూకుడుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌ను చర్యలను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సముద్ర తీరాల్లో

సబ్‌మెరైన్లను ధ్వంసం చేసే యుద్ధ విమానాలు.. పాకిస్థాన్‌కు భారత్ చెక్ పెడుతుందా?
, మంగళవారం, 31 అక్టోబరు 2017 (11:09 IST)
పాకిస్థాన్ చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సమాయత్తమవుతోంది. భారత్ పట్ల దూకుడుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌ను చర్యలను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సముద్ర తీరాల్లో జరిగే యుద్ధాల్లో ముఖ్య‌పాత్ర పోషించే అత్యుత్తమ స్థాయి సబ్‌మెరైన్లను భార‌త్ ఎప్పుడో సమకూర్చుకుంది. కానీ వాటిని గుర్తించి ధ్వంసం చేసే అమెరికాలోకి లాక్‌హీడ్‌ మార్టీన్‌ నుంచి పి-3సీ విమానాన్ని 1996లో పాకిస్థాన్ కొనుగోలు చేసింది. 
 
ఈ విమానాలను అప్‌గ్రేడ్‌ చేయిస్తూ వ‌స్తోంది. ఈ నేపథ్యంలో ఈ విమానాలకు స‌మాచారం అంద‌కుండా భార‌త్‌ సబ్‌మెరైన్లను అప్‌గ్రేడ్‌ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జపాన్‌ కూడా పి-3సీ నిఘా విమానాలను వినియోగిస్తుండ‌డంతో యుద్ధ విన్యాసాల్లో భాగంగా వాటిని భారత సిబ్బంది వినియోగిస్తారు. దీంతో పి-3సీపై భారత సిబ్బందికి పట్టువస్తుంది. 
 
ఈ విమానాలు గోవాలోని ఐఎన్‌ఎస్‌ హంసాకి చేరుకున్న తరుణంలో... భారత్‌ తరపున పీ-8ఐ నిఘా విమానాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి. భార‌త స‌బ్‌మెరైన్ల క‌ద‌లిక‌ల‌ను పాక్ క‌నిపెట్ట‌కుండా చేసేలా భారత నావికాదళం చ‌ర్య‌లు తీసుకుంటోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూట్యూబ్‌లో ''యూట్యూబ్ మ్యూజిక్'' కొత్త యాప్.. స్క్రీన్ ఆన్‌లో?