Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాన్పూర్ వన్డేలో కోహ్లీ సేన గ్రేట్ విక్టరీ... సిరీస్ కైవసం

పర్యాటక జట్టు న్యూజీలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

కాన్పూర్ వన్డేలో కోహ్లీ సేన గ్రేట్ విక్టరీ... సిరీస్ కైవసం
, సోమవారం, 30 అక్టోబరు 2017 (09:04 IST)
పర్యాటక జట్టు న్యూజీలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన... నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ముంగిట 338 పరుగులను టార్గెట్‌గా నిర్ధేసించింది. భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సెంచరీతో చెలరేగిపోయారు. 
 
భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ (147), శిఖర్ ధావన్ (14), కోహ్లీ (113), పాండ్యా (8), ధోనీ (25), జాదవ్ (18), కార్తీక్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో టీజీ సౌథీ 2, ఏఎఫ్ మిల్న్ 2, ఎంజె సాంత్నర్ 2 చొప్పున పరుగులు చేశారు. 
 
అనంతరం 337 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లు చివరివరకు పోరాటం చేసి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేశారు. న్యూజిలాండ్ ఆటలో గుప్తిల్ (10), మున్రో (75), విలియమ్ సన్ (64), టేలర్ (39), నికోలస్ (37), లాథమ్ (65), సాంత్నర్ (9), గ్రాండ్హొమ్ 8,  సౌథీ 4 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, బుమ్రా 3, చాహల్ 2 చొప్పున పరుగులు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ గడ్డపై దిగిన శ్రీలంక క్రికెటర్లు.. 8 ఏళ్ల తర్వాత మ్యాచ్.. భారీ భద్రత