Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉ.కొరియాలో అణుప్రమాదం.. 200 మంది మృత్యువాత

ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (06:21 IST)
ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ విషయాన్ని జపాన్‌ మీడియా అధికారికంగా వెల్లడించింది. గత నెల 10వ తేదీన మిలిటరీ సైట్‌ వద్ద నిర్మాణ పనులు చేపట్టుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయినట్లు పేర్కొంది. తొలుత సొరంగంలో 100 మంది చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపడుతుండడంతో మిగిలిన భాగం వారిపై కూలిపోయింది.
 
దాంతో మరో 100 మంది మృత్యువాతపడ్డారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఉ.కొరియా అధికారులు స్పందించలేదు. ఇటీవల ఉత్తర కొరియా అతపెద్ద హైడ్రోజన్‌ బాంబ్‌ను పరీక్షించడంతో ఆ ప్రదేశం మొత్తం దెబ్బతింది. దాంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని జపాన్‌ మీడియా వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాపై కయ్యానికి కాలుదుతున్న ఉ.కొరియాకు ఈ ఘటన గట్టి ఎదురుదెబ్బే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments