Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉ.కొరియాలో అణుప్రమాదం.. 200 మంది మృత్యువాత

ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (06:21 IST)
ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ విషయాన్ని జపాన్‌ మీడియా అధికారికంగా వెల్లడించింది. గత నెల 10వ తేదీన మిలిటరీ సైట్‌ వద్ద నిర్మాణ పనులు చేపట్టుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయినట్లు పేర్కొంది. తొలుత సొరంగంలో 100 మంది చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపడుతుండడంతో మిగిలిన భాగం వారిపై కూలిపోయింది.
 
దాంతో మరో 100 మంది మృత్యువాతపడ్డారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఉ.కొరియా అధికారులు స్పందించలేదు. ఇటీవల ఉత్తర కొరియా అతపెద్ద హైడ్రోజన్‌ బాంబ్‌ను పరీక్షించడంతో ఆ ప్రదేశం మొత్తం దెబ్బతింది. దాంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని జపాన్‌ మీడియా వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాపై కయ్యానికి కాలుదుతున్న ఉ.కొరియాకు ఈ ఘటన గట్టి ఎదురుదెబ్బే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments