Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెలారస్ ఉద్యమ కారుడికి నోబెల్ శాంతి బహుమతి

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (19:29 IST)
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు, సంస్థలకు ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఈ యేడాది బెలారస్ దేశానికి చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు బైలియాట్ స్కీ, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రెయిన్‌ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు ఈ శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ఉద్యమకారుడు, ఉద్యమ సంస్థలు తమ దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పట్ల అవగాహనం కల్పించడం, ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా కమిటీ వివరించింది. 
 
ఈ యేడాది శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలు నమోదు చేయడం, మావన హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడంతో ద్వారా అమోఘమైన కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. శాంతి ప్రజాస్వామ్యం నెలకొల్పడంతో పౌర సమాజం పాత్ర ప్రాముఖ్యతను వారు చెప్పారని వివరించింది. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments