Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలస్తీనా ఎంబసీలో భారత రాయబారి అనుమానాస్పద మృతి

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (09:27 IST)
పాలస్తీనా దేశంలో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తూ వచ్చిన ముకుల్ ఆర్య అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయన ఎంబసీలోనే విగతజీవిగా పడిపుండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్ ఆర్య ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో విద్యను అభ్యసించారు. 
 
ఆ తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కాబూల్, మాస్కాల్లోని భారత రాయబార కార్యాలయాలతోపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పని చేశారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో కూడా విధులు నిర్వహించారు. 
 
అలా ఉజ్వలమైన కెరీర్‌తో ముందుకుసాగుతూ వచ్చిన ముకుల్ ఆర్య ఉన్నట్టుండి విగతజీవిగా కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ధృవీకరించి, ఆయన మృతిపట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ ష్టాయేలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా, ముకుల్ ఆర్య భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments