Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలస్తీనా ఎంబసీలో భారత రాయబారి అనుమానాస్పద మృతి

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (09:27 IST)
పాలస్తీనా దేశంలో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తూ వచ్చిన ముకుల్ ఆర్య అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయన ఎంబసీలోనే విగతజీవిగా పడిపుండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్ ఆర్య ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో విద్యను అభ్యసించారు. 
 
ఆ తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కాబూల్, మాస్కాల్లోని భారత రాయబార కార్యాలయాలతోపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పని చేశారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో కూడా విధులు నిర్వహించారు. 
 
అలా ఉజ్వలమైన కెరీర్‌తో ముందుకుసాగుతూ వచ్చిన ముకుల్ ఆర్య ఉన్నట్టుండి విగతజీవిగా కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ధృవీకరించి, ఆయన మృతిపట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ ష్టాయేలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా, ముకుల్ ఆర్య భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments