Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యోగి'తో రహస్య సమాచారం షేర్ చేసిన చిత్రా రామకృష్ణన్.. అరెస్టు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (09:17 IST)
హిమాలయాల్లో ఉన్న ఒక యోగితో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణన్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఎన్.ఎస్.ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ యోగితో షేర్ చేసుకున్నందుకుగాను ఆమెను సీబీఐ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. 59 యేళ్ల చిత్ర రామకృష్ణన్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌కు ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 
 
ఈమె 2013-16 మధ్యకాలంలో ఎన్.ఎస్.ఈకి సీఈవోగా పని చేశారు ఆ సమయంలో ఎన్.ఎస్.ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని హిమాలయాల్లో నివసించే ఒక యోగితో షేర్ చేసుకున్నారు. అదీ కూడా ఈమెయిల్ ద్వారా షేర్ చేశారు. 
 
అయితే, ఆ యోగి ఎవరో కాదు... ఎన్.ఎస్.ఈ మాజీ ఉద్యోగి ఆనంద్ సుబ్రహ్మణ్యమేనని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆయన ఈ నెల ఆరంభంలోనే అరెస్టు అయిన విషయం తెల్సిందే. 
 
2010-15 మధ్య కాలంలో ఎన్ఎస్ఈలో అవకతవకలు జరిగినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించి బయటపెట్టిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్ఎస్ఈ సమాచారాన్ని 2014-16 మధ్యకాలంలో గుర్తు తెలియని వ్యక్తితో చిత్రా రామకృష్ణన్ ఈమెయిల్ ద్వారా షేర్ చేసినట్టు సెబీ గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సేకరించింది. దీంతో ఆమెను ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments