Webdunia - Bharat's app for daily news and videos

Install App

కువైట్‌లో వలస ఉద్యోగులకు షాక్.. త్వరలో నిషేధం

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (11:15 IST)
కువైట్‌ దేశానికి వలస వెళ్లి ఉద్యోగం చేస్తున్న ఇతర దేశాలకు చెందిన వారికి ఆ దేశ ప్రభుత్వం తేరుకోలేని షాకివ్వనుంది. వలస ఉద్యోగులను క్రమంగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వలసదారులను ఎట్టి పరిస్థతుల్లోనూ 2028 నాటికి పూర్తిగా తొలగించేయాలని భావిస్తోంది. 
 
అదేవిధంగా ప్రైవేటు రంగంలో కనీసం 30 శాతం నుంచి 60 శాతం వరకు స్వదేశీ ఉద్యోగులే ఉండేలా జీవోను జారీచేయనుంది. వలసదారులకు ఉద్యోగాలివ్వడం వల్ల కువైట్ వాసుల భవితవ్యం దెబ్బతింటోందని, వారు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కఠిన చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. 
 
ప్రస్తుతం కువైట్‌ బ్యాంకింగ్ రంగంలో 66 శాతం వలసదారులే పని చేస్తున్నారని, వీరిని తొలగించి వారి స్థానాలను కువైట్ వాసులకు ఇవ్వాలని యోచిస్తోంది. దీనికోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రభుత్వం.. ఈ యేడాది కనీసం 8 వేల మంది వలసదారులను తొలగించి వారి స్థానాలను స్వదేశీయులతో భర్తీ చేయనుంది. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కువైట్‌ వాసులు 26వేల మంది ఉండగా, వలసదారులు 83 వేల మంది ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments