Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత - అవ్వల వద్ద ఉంటున్న బాలికపై అత్యాచారం... మృతశిశువును జన్మించి మృతి

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (11:03 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట జిల్లాలోని ఊతంక్కరై పుదూర్ సమీపంలో 17 యేళ్ళ బాలికపై 27 యేళ్ళ యువకుడు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఊతంక్కరై పుదూర్ గ్రామానికి చెందిన 17 యేళ్ళ బాలిక స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటూ తాత - అవ్వల వద్ద నివశిస్తోంది. ఈ  బాలికపై అదే గ్రామానికి చెందిన 27 యేళ్ల యువకుడు ఒకడు కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. 
 
ఆ తర్వాత బాలికపై పదేపదే అత్యాచారం చేయసాగాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయాన్ని తాత అవ్వలకు తెలియకుండా ఆ బాలిక దాచిపెట్టింది. అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించసాగడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... బాలిక గర్భంతో ఉన్నట్టు తేల్చారు. ఆ తర్వాత ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. దీంతో మృతురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తమిళరసన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం