Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భారత్ - రష్యా శిఖరాగ్ర సదస్సు - హస్తినకు రానున్న పుతిన్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (09:05 IST)
భారత్, రష్యా దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సు సోమవారం జరుగనుంది. ఇందుకోసం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. 
 
ఇందుకోసం హస్తినకు చేరుకునే పుతిన్... సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. 
 
ముఖ్యంగా రక్షణ, వాణిజ్యం అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో వివిధ రకాల ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అలాగే, 200 అత్యాధునిక హెలికాఫ్టర్ల తయారీపై కూడా రష్యాతో భారత్ ఓ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. 
 
ఈ శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత పుతిన గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమం తర్వాత పుతిన్ రాత్రి 9.30 గంటలకి తిరిగి రష్యాకు వెళ్లిపోతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments