Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై టెస్ట్ మ్యాచ్ : కివీస్ ముగింట 540 టార్గెట్

ముంబై టెస్ట్ మ్యాచ్ : కివీస్ ముగింట 540 టార్గెట్
, ఆదివారం, 5 డిశెంబరు 2021 (14:44 IST)
ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ముంగిట భారత్ 540 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడారు ఫలితంగా ఏడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేశారు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ ఆధిక్యంతో కలుపుకుని కివీస్ ముంగిట 540 పరుగులు ఉంచిది. 
 
భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అగర్వాల్ (62), పుజారా (47) చొప్పున పరుగులు చేసి తొలి వికెట్‌కు 107 పరుగులు చేశారు. ఆ తర్వాత గిల్ 47, కెప్టెన్ కోహ్లీ 36, అక్షర్ పటేల్ 26 బంతుల్లో 41 పరుగులు చేశారు. ముఖ్యంగా కివీస్ బౌలర్లను పటేల్ చీల్చిచెండాడు. 
 
మరోవైపు, కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్‌ మరోమారు రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో ముంబై టెస్టులో అజాజ్ పటేల్ ఏకంగా 14 వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 540 పరుగుల విజయలక్ష్య ఛేదన కోసం కివీస్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత బౌలర్లు అదుర్స్... 62 పరుగులకే కివీస్ ఆలౌట్..