Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు సంక్షోభంలో పాకిస్థాన్ సర్కారు.. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (09:06 IST)
పాకిస్థాన్ సర్కారు పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. పడింది. పలువురు ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇమ్రాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది.  
 
ఇప్పటికే ఇమ్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు గతవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. తాజాగా ముగ్గురు మంత్రులు, 24 మంది ఎంపీలు రాజీనామా చేయడంతో పరిస్థితి మారిపోయింది. 
 
దీంతో ప్రభుత్వ నిర్వహణలోనూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, విదేశాంగ విధానంలోనూ ఇమ్రాన్‌ఖాన్ విఫలం అయ్యారని విపక్షం ఆరోపిస్తోంది.
 
అయితే, ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో ఏ ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. వచ్చేవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 
 
ఇమ్రాన్‌ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి.
 
నవాజ్‌షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లింలీగ్ -నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలకు కలిపి 163 మంది సభ్యులు ఉన్నారు. ఇక అవిశ్వాసానికి ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments