Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైడ్రాక్సీ క్లోరోక్విన్ చాలా డేంజరస్?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:32 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. మలేరియాకు ఉపయోగించే ఈ ఔషధం కరోనా చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తుందనే అంచనాలతో దీనికి డిమాండ్ ఏర్పడింది.

అయితే, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రమాదకారి అని... దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) హెచ్చరించింది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఈ ఔషధానికి సంబంధించిన వివరాల్లో ముందుగానే వీటిని పొందుపరిచారని చెప్పింది. ఈ సైడ్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని చికిత్స అందించాలని సూచించింది. కరోనా బాధితుడి పరిస్థితిని బట్టి ఏ ఔషధం వాడాలనే విషయాన్ని అక్కడున్న వైద్య సిబ్బంది జాగ్రత్తగా నిర్ణయించాలని తెలిపింది.

కరోనాపై సమర్థవంతంగా పోరాడే ఔషధాల కోసం ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని ఎఫ్డీఏ చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వాడేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపింది. ఈ డ్రగ్ వాడకానికి సంబంధించి పూర్తి వివరాలను వైద్యులకు అందుబాటులో ఉంచాలని సూచించింది. 

మరోవైపు, ఈ ఔషధ నిల్వలు భారత్ వద్ద ఎక్కవగా ఉండటంతో... ఎన్నో దేశాలు వీటిని సరఫరా చేయాల్సిందిగా మన దేశాన్ని కోరాయి. సాయం కోరిన అన్ని దేశాలకు భారత్ ఈ డ్రగ్ ను సరఫరా చేసింది. తద్వారా ప్రపంచ దేశాలకు స్నేహ హస్తాన్ని అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments