Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీపై బాంబుల వర్షం.. ఆరు ప్రాంతాల్లో ఉగ్రమూకల కాల్పులు

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (11:47 IST)
సెంట్రల్ మాలీపై ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో 50 మంది అల్ ఖైదాకు చెందిన జీహాదీలు హతమయ్యారు. బుర్కినా ఫాసో, నైగర్ సరిహద్దుల్లో వేచివున్న ప్రభుత్వ దళాలు ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు వీలును కల్పించేందుకు ఈ దాడులు జరిగిన నేపథ్యంలో.. ఆస్ట్రియాలోని వియన్నాలో కాల్పులు కలకలం రేపాయి. 
 
ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. భద్రతాదళాల చేతిలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. వియన్నాలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. 
 
ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. భారత్‌లోని ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తరహాలో ఏక కాలంలో కాల్పులకు తెగబడాలని ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుడని ఆస్ట్రియా మంత్రి కార్ల్ నెహ్‌మర్ తెలిపారు. ఊహించని ఈ ఉగ్ర దాడులతో వియన్నా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments