Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్‌ఏంజెల్స్‌లో కాల్పుల మోత - నలుగురి మృతి

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (09:10 IST)
అగ్రరాజ్యం అమెరికా మరోమారు కాల్పుల మోతతో దద్ధరిల్లిపోయింది. ఈ దేశంలోని లాస్ ఏంజెల్స్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పయారు. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
లాస్ ఏంజెల్స్‌కు సమీపంలోని ఇంగ్లెవుడ్‌లోని ఓ ఇంట్లో జరుగుతున్న పార్టీని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఆ ఇంటిపై కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ఇంగ్లెవుడ్ మేయర్ జైమ్స్ బట్స్ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. 
 
కాగా, 1990 తర్వాత ఇంగ్లెవుడ్‌లో జరిగిన అతిపెద్ద కాల్పుల ఘటన ఇదేనని ఆయన గుర్తుచేశారు. లాస్ ఏంజెల్స్‌ నగరం హాలీవుడ్‌కు నిలయంగా ఖ్యాతిగడించిన విషయం తెల్సిందే. ఈ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంగ్లెవుడ్‌లో దుండగులు తుపాకీలతో రెచ్చిపోయి మారణహోం సృష్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments