Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఎన్ఎస్ రణ్‌వీర్ నౌకలో అగ్నిప్రమాదం - ముగ్గురి మృతి

ఐఎన్ఎస్ రణ్‌వీర్ నౌకలో అగ్నిప్రమాదం - ముగ్గురి మృతి
, బుధవారం, 19 జనవరి 2022 (08:34 IST)
ముంబై డక్ యార్డులో ఓ విషాద సంఘటన జరిగింది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్ డిస్ట్రాయర్ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నౌకాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ నౌకలో ఉన్నట్టుండి పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
మీడియా కథనాల మేరకు ఐఎన్ఎస్ రణ్‌వీర్ ఇంటర్నెల్ కంపార్ట్‌మెంట్‌లో ఈ పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్తి నష్టం పెద్దగా సంభవించలేదు. 
 
ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ పేలుడు గల కారణాలు తెలియాల్సివుంది. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓడలోని సిబ్బంది తక్షణం స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ పోర్ట్‌ఫోలియోలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ను పరిగణలోకి తీసుకునేందుకు కీలక కారణాలు