Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్న ఈయూ

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:33 IST)
పాకిస్థాన్‌లో తలదాచుకొని భారతదేశంపై ఉగ్రదాడులు చేస్తున్న జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి మోకాలడ్డుతున్న చైనాకు చెంపపెట్టులాంటి నిర్ణయం ఒకటి తెర మీదకు వచ్చింది. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సిద్ధమవుతోంది. 
 
మసూద్‌పై చర్యకు భద్రతా మండలిలో అన్ని దేశాలు అంగీకరిస్తున్నప్పటికీ వీటో అధికారం ఉన్న చైనా పదేపదే మోకాలడ్డుతూండడంతో అతన్ని తమకు తాముగా ఉగ్రవాది జాబితాలో చేర్చాలని యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయించింది. గతవారం ఐక్యరాజ్య సమితిలో ఈ తీర్మానాన్ని ప్రస్తావించిన ఫ్రాన్స్‌ ఇప్పటికే తమ దేశంలో జైషే చీఫ్‌ను నిషేధించి... తమ దేశంలోని అతని ఆస్తులను స్తంభింపజేసింది.
 
ఈ దిశగా మిగిలిన దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎమాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. యూనియన్‌లోని 28 సభ్య దేశాలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 2009, 2016 సంవత్సరాలతోపాటు ఇటీవలి యూఎన్‌ భద్రతా మండలిలో మసూద్ అజర్‌పై తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. ఇది జరిగిన కొద్దిరోజులకే యూరోపియన్‌ యూనియన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది అమల్లోకి వస్తే చైనా తీరుకు చెంపపెట్టే అనవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments