Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన మరో భారీ ప్రమాదం

విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన మరో భారీ ప్రమాదం
, బుధవారం, 20 మార్చి 2019 (11:31 IST)
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతుండటంతో విమాన ప్రయాణీకుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇటీవలే వరుసగా బోయింగ్ విమానాలు కూలిపోతున్న ఘటనలు జరుగగా తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది.


విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో దాదాపు 100 మంది ప్రయాణీకులు అందులో ఉన్నారు. సకాలంలో స్పందించిన సిబ్బంది వెంటవెంటనే ప్రయాణీకులను కిందికి దించేసారు.
 
ఇరాన్ ఎయిర్ కంపెనీకి చెందిన ఫాకర్ 100 విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక కారణాలతో వెనుకవైపు ఉండే ల్యాండింగ్ గేర్ సకాలంలో తెరుచుకోకపోవడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలిపారు. వెంట వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ హాని  జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాల కోసం మరింత లోతైన దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5జీ సాంకేతికతతో చైనా వైద్యుల ఆపరేషన్.. అరుదైన ఘనత సాధించారు..