Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ను మేము పుట్టించలేదు.. దోషిగా చిత్రీకరించొద్దు.. చైనా

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (17:29 IST)
కరోనా వైరస్‌ను చైనా కావాలనే సృష్టించిందని .. ఇతర దేశాలపై ప్రయోగం కోసం తయారు చేసే క్రమంలో అది దారి తప్పిందన్న ప్రచారం సాగింది. కరోనా వైరస్ కారణంగా చైనాలో 3,200 మందికి పైగా మరణించారు. 82వేల పాజిటివ్ కేసులు ఇంకా చైనాలో ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై స్పందించిన చైనాకరోనా వైరస్‌ను చైనా తయారు చేయడంగానీ, ఉద్దేశపూర్వకంగా వ్యాపించేలా చేయలేదని స్పష్టం చేసింది. 
 
కరోనా వైరస్‌ను కొందరు చైనీస్‌ వైరస్, వుహాన్‌ వైరస్‌‌గా పిలవడాన్ని ఆ దేశం తప్పుబట్టింది. కరోనాను తాము పుట్టించలేదని.. దానిమూలాలు ఎక్కడ నుంచి వచ్చాయో కనుగొంటున్నామని పేర్కొంది. కరోనా ప్రభావం చైనాపై కూడా చాలా ఎక్కువగానే ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది. కావాలనే కొందర చైనాను దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. 
 
ఇలాంటి ఆరోపణలు చేయడం మాని.. కరోనాను ఎదుర్కోవడంలో చైనా స్పందించిన తీరును ప్రపంచం గమనించాలని డ్రాగన్ కంట్రీ వెల్లడించింది. కరోనా వైరస్ సాధారణ ప్రక్రియలో భాగంగానే ఇది పుట్టిందని చైనా చెబుతోంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనను చైనా గుర్తు చేస్తోంది. కానీ చైనా వాదనను మిగిలిన ప్రపంచం నమ్మడం లేదు. ముఖ్యంగా అమెరికా అయితే చైనా తీరుపై మండిపడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments