Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో ఇద్దరు వైద్యులకు కరోనా... వారిని కలిసిన వారికి ఆ ఆదేశాలు

తెలంగాణాలో ఇద్దరు వైద్యులకు కరోనా... వారిని కలిసిన వారికి ఆ ఆదేశాలు
, గురువారం, 26 మార్చి 2020 (15:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రోజూ కరోనా కేసుల సంఖ్య నమోదవుతోంది. ఇప్పటివరకు మొత్తం 44 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఇద్దరు వైద్యులకు కూడా ఈ వైరస్ సోకింది. 
 
హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన 41 యేళ్ళ వైద్యుడుతో పాటు ఆయన భార్య(36)కూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈమె కూడా వైద్యురాలే కావడం గమనార్హం. అలాగే, కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈన ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. 
 
డాక్టర్లయినా భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
ఇదిలావుంటే, దేశరాజధాని ఢిల్లీలో బస్తీ దవాఖాన నడిపే ఓ డాక్టరుకు కరోనా సోకడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఆయన భార్యకు, టీనేజీ కూతురికి పరీక్షలు జరిపితే వారికీ పాజిటివ్ వచ్చింది. మరో వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్టు తేలింది. 
 
దాంతో ఆయన క్లినిక్‌ను సందర్శించిన సుమారు 900 మందిని క్వారంటైన్ చేశారు. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ ఈ సంగతి వెల్లడించారు. 14 రోజుల పాటు అనుమానితులకు క్వారంటైన్ కొనసాగుతుంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ మహిళ మార్చి 12న ఆ బస్తీ దవాఖానాను సందర్శించడమే ఈ కరోనా గొలుసుకట్టు వ్యాప్తికి కారణమని తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫ్రికాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 92మంది సైనికుల మృతి