Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫ్రికాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 92మంది సైనికుల మృతి

ఆఫ్రికాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 92మంది సైనికుల మృతి
, గురువారం, 26 మార్చి 2020 (15:03 IST)
ఆఫ్రికాలో మళ్లీ బోకోహరం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చాద్ ప్రాంతం, లాక్ ప్రావిన్స్‌లోని బోమా గ్రామంలోకి వచ్చిన ఉగ్రవాదులు సైన్యంపైకి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 92 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది నెలలుగా అక్కడ తరచూ ఉగ్రవాదులు సైన్యంపై దాడికి పాల్పడుతున్నారు. ఆఫ్రికా దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సైనికులు ప్రాణాలు కోల్పోయింది ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
 
ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదని.. చాద్‌ అధ్యక్షుడు ఇడ్రిస్‌ డెబి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం రోజు.. ఉత్తర నైజీరియాలో కూడా బొకొహారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అక్కడ కూడా దాదాపు 50 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. 
 
మరోవైపు కాబూల్‌లోని గురుద్వారపై ఉగ్రమూకలు దాడి జరిగింది. ఆప్ఘనిస్థాన్ రాజధాని అయిన కాబూల్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 25 మందికి పైగా మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కష్టాల్లో కూడా ఫేస్‌టైమ్ ద్వారా వివాహం.. ఎక్కడ?