Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటల్లో చిక్కుకున్న బల్గేరియా బస్సు-45మంది సజీవదహనం

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (15:56 IST)
బల్గేరియాలో ఓ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 45మంది సజీవదహనం అయ్యారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా ఈ బస్సు మంటల్లో చిక్కుకుంది. 
 
ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది.  ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాసిడోనియా రాయబార కార్యాలయం ప్రతినిధులు బాధితులను తీసుకెళ్లిన ఆసుపత్రిని సందర్శించారని బల్గేరియన్ వార్తా సంస్థ నోవినిట్ తెలిపింది. ప్రమాదానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments